Nov 14,2023 22:43

పార్టీలోకి చేరిన వారితో చిలకం మధుసూదన్‌రెడ్డి

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి పిలుపు నిచ్చారు. ఈ మేరకు ఆయన మంగళవారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు నాయకులు జనసేన పార్టీలోకి చేరారు. మండలంలోని పోతులనాగేపల్లి గ్రామానికి చెందిన కుల్లంపల్లిరమేశ్‌, మురేప్పగారి శంకర్‌, కలవగడ్డనరసింహులు, పెద్దినాయుడు, కృష్ణంనాయుడు, రామాంజినేయులు తదితరులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి పార్టీ కండువాలు వేసి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార వికాస విభాగం ప్రధానకార్యదర్శి బెస్తశ్రీనివాసులు, కార్యనిర్వాహణ కమిటీ సభ్యులు ప్యాదిండి వెంకటేశ్‌, నాయకులు వెంకటేశ్‌, కోటికి రామాంజి, బండ్ల చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.