Nov 17,2023 22:43

ప్రజాశక్తి-హనుమాన్‌జంక్షన్‌ : పాడి రైతుల సంక్షేమానికి కష్ణా మిల్క్‌ యూనియన్‌ నిరంతర కషి చేస్తుందని చైర్మన్‌ చలసాని ఆంజనేయులు అన్నారు.పాడి రైతు సంక్షేమం మన మతం అలుపెరగని సేవ మన అభిమతం' అనే కార్యక్రమంలో భాగంగా బుధవారం హనుమాన్‌ జంక్షన్‌ క్లస్టర్‌ పరిధిలోని వైకుంట లక్ష్మీపురం, రామన్నగూడెం సొసైటీలను సందర్శించి అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు, రైతులతో సమావేశం నిర్వహించారు. అబివృవద్ధికి చేపట్టాల్సిన అంశాలపై రైతులకు వివరించి నిర్వహణలో ప్రతి రైతు యాజమాన్య పద్ధతులు పాటించాలని చలసాని ఆంజనేయులు అన్నారు. అనంతరం వైకుంట లక్ష్మీపురం గ్రామంలో ఉన్నత చదువులు చదివి కూడా పాడి మీద ఆసక్తి ఉన్న యువ పాడి రైతులను పొట్లూరి శ్రీకాంత్‌, చైతన్యాలను రామన్నగూడెం గ్రామంలో మూసి వేసిన పాల కేంద్రాన్ని తమ స్వంత ఖర్చులతో బాగు చేయించి ఆధునిక పరికరాలతో ప్రారంభించిన సంఘ అధ్యక్షులు రెడ్డి వీరాంజనేయులును,అధికంగా పాల ఉత్పత్తి చేసిన పాడి రైతులను సాలువాలతో చలసాని సత్కరించారు.ఈ కార్యక్రమంలో మేనేజర్‌ కిరణ్‌,సంఘ అధ్యక్షులు, సంఘ పాలక వర్గ సభ్యులు, సూపర్‌ వైజర్‌, పాడి రైతులు పాల్గొన్నారు.