పల్నాడు జిల్లా: ప్రజా స్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు చాలా కీలకమని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. అమరావతి మండలంలో జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి బూత్ లెవల్ అధికారులతో కలిసి ఓటర్ల పరిశీలన చేశారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటర్ల జాబితా ను సన్నద్ధం చేయడంలో ఎక్కడా ఆరోపణలు, అవకతవకలకు తావులేకుండా అధికారులు పని చేయాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ఆదేశించారు. అన్ని రాజకీయ పార్టీల వినతులను పరిగణలోకి తీసుకొని ఓటర్ల జాబితా ను సన్నద్ధం చేయాలని జిల్లా అధికారులను సూచించారు. పల్నాడు జిల్లాలో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సంక్షిప్త ఓటర్ల జాబితా సర్వే ప్రక్రియ కు సంబంధించి అమరావతి మండల రెవెన్యూ కార్యా లయంలో వీడియో కాన్ఫరెన్స్ ఈఆర్ ఓ లు, ఏఈఆర్ఓ లతో నిర్వహించారు. సంక్షిప్త ఓటర్ల జాబితా సర్వే జరుగుతున్న తీరును జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను జిల్లా అధికారులను అడిగి తెలుసుకొని, అందుకు తగిన విధంగా తీసుకోవల్సిన చర్యలపై దిశా,నిర్దేశనం చేశారు. 28 మండలాలు, 7 నియోజక వర్గాలలలో ఎన్నికల నిర్వహణ అధికారులు గా కొనసాగుతున్న వారు నిష్పక్త పాతంగా సర్వే ప్రక్రియ త్వరగా పూర్తిచేసి నివేదికను కలెక్టరేట్ కు పంపాలని ఆదేశించారు. రాజకీయ పార్టీల సహాకారంతో ఎక్కడా ఆరోపణలు లేకుండా అందరి సహకారంతో మెరుగైన ఓటర్ల జాబితా ను సన్నద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సర్వే జరుగుతున్న క్రమంలో రాజకీయ పార్టీలకు చెందిన పోలింగ్ బూత్ లెవల్ ఎజెంట్ల సమక్షంలో వచ్చే ఇబ్బందులను అధిగమించాలని సూచించారు. ఓటర్ల జాబితా లో మార్పులు, చేర్పులు, చని పోయిన వారి పేర్లను తొలగించడం, కొత్త ఓటర్ల ను చేర్చడం లో ఎక్కడా ఆరోపణలు రావడానికి వీలు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.










