Aug 03,2023 23:05

పరిశీలిస్తున్న డిఆర్‌ఒ మురళీకృష్ణ

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఓటింగ్‌ యంత్రాలు కలెక్టరేట్‌కు చేరుకున్నాయి. వాటిని ఇవిఎంలు భద్రతపరిచే గదిలో కట్టదిట్టమైన భద్రత నడుమ భద్రపరిచారు. కలెక్టరేట్‌ ఆవరణలో ఉన్న ఈ గోదాములో ఈ యంత్రాల పనితీరును జిల్లా రెవెన్యూ అధికారి మురళీకృష్ణ గురువారం పరిశీలించారు. ఇవిఎంలతో పాటు వివిప్యాట్‌ల్లో సాంకేతికపరమైన లోపాలను సరిచేశారు. పరిశీలనలో కలెక్టరేట్‌ ఇ-సెక్షన్‌ సూపరింటెండెంట్‌ ప్రకాష్‌తో పాటు డిప్యూటీ తహశీల్దార్లు ఉఉన్నారు.