Jul 30,2021 11:28

తెలంగాణ : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామంలో కరోనా కలకలం రేపింది. ఆకెనపల్లిలో కొత్తగా 29 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ గ్రామం నుండి ఓ కుటుంబం మహారాష్ట్రలో వివాహానికి వెళ్లి వచ్చారు. దీంతో ఈ కుటుంబంలోని అందరికీ కరోనా పాజిటివ్‌ వచ్చింది. అంతేకాకుండా వీరి ద్వారా గ్రామంలో 29 మందికి కరోనా సోకడంతో గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.