
ప్రజాశక్తి-ఉక్కునగరం : ఉక్కునగరంలోని నెహ్రూ పార్కులో ఒబిసి ఉద్యోగులు ఆదివారం సమావేశమయ్యారు. ఈ నెల 7వ తేదీన జరిగే అసోసియేషన్ ఎన్నికలలో గుర్తింపు కోసం మహాత్మా జ్యోతిరావుపూలే ఫౌండర్స్ ప్యానల్ ప్రచారంలో భాగంగా ఆత్మీయ కలయిక జరిగింది. ఈ సమావేశంలో కమిటీ అభ్యర్థులు, వివిధ విభాగాల ఉద్యోగులు, ఆర్హెచ్.కాలనీ నాయకులు, ఆత్మీయులు, అభిమానులు, సానుభూతిపరులు పాల్గొన్నారు. గత ఐదేళ్లుగా ఒబిసి ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేసే ప్రస్తుత నాయకత్వాన్ని బలపరుస్తూ ఎన్నికల్లో గెలుపొందేందుకు అందరూ కృషిచేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో కోమటి రవిశంకర్, నక్కా వెంకట రమణ, నెల్లి అప్పలరాజు, పిల్లి చంద్రరావు, ఎన్నేటి రమణ, కాంబ్లే, నమ్మి తాతారావు, చిత్రాడ కల్యాణి, ఎల్లేటి శ్రీనివాస్, చిత్రాడ రమణ, విఎం.నాయుడు, కెజె.అప్పారావు, విఎస్ఆర్.మూర్తి, నమ్మి సత్యనారాయణ, ప్రగఢ గోవిందరాజులు, రాజమోహన్ పాల్గొన్నారు.