
ప్రజాశక్తి- గాజువాక : బిహెచ్ఇఎల్ యాజమాన్యం ఏకపక్షంగా ప్రవేశపెట్టిన నూతన పంచింగ్ విధానాన్ని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యాన మెయిన్ గేటు వద్ద శనివారం నల్లజెండాలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా భెల్ యూనిట్ సిఐటియు ప్రధాన కార్యదర్శి జిటిపి ప్రకాష్ మాట్లాడుతూ, మెయిన్ గేటు వద్ద, ప్రతి సెక్షన్లోనూ పంచింగ్ విధానం ప్రవేశ పెట్టడం దారుణం అన్నారు. కార్మికులను ఎనిమిది గంటల పని విధానం ప్రవేశపెట్టి, ఇతర యూనిట్లు మాదిరిగా అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం ప్రవేశపెట్టిన సర్క్యులర్ను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రెండు సార్లు పంచింగ్ విధానం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో కె.విజరుకుమార్, ఎస్.జగన్నాధరావు, నారపరెడ్డి, అప్పారావు, జి.అచ్చంనాయుడు, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.