Nov 18,2023 00:18

శంకుస్థాపన చేస్తున్న ప్రజా ప్రతినిధులు


ప్రజాశక్తి -అనంతగిరి:మండల కేంద్రంలోని నూతన పెట్రోల్‌ బంక్‌ సమీపంలో రైతు కూలీ ఉత్పత్తి సంఘం భవనం నిర్మించేందుకు ఎంపీపీ శెట్టి, నీలవేణి, స్థానిక సర్పంచ్‌ సోమ్మెల రూతు శంకుస్థాపన చేశారు. అనంతరం సర్పంచ్‌, ఎంపీపీ లు మాట్లాడుతూ, ప్రభుత్వం రైతు కూలీ ఉత్పత్తిల సంఘం భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిం దన్నారు. పనులను మరింత వేగవంతం చేసి భవనం పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌లకు సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎస్‌. నాగులు వెలుగు సీసీలు ఆనంద్‌, త్రినాథ్‌, అప్పలరాజు, అకౌం టెంట్‌ ప్రీతి సిబ్బంది దిలీప్‌, అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.