Nov 20,2023 17:45

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
  నూకాలమ్మ రజిత వస్త్ర తయారీకి దాతలు వెండిని అందించారని ఆలయ ఛైర్మన్‌ డాక్టర్‌ రాజాన సత్యనారాయణ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 35 కేజీల వెండితో నూకాలమ్మ అమ్మవారికి రజిత వస్త్రం తయారు చేయించ తలపెట్టినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో స్థానిక గంగానమ్మ గుడి సెంటర్‌, శ్రీనిహారిక జ్యూయలర్స్‌, మాడ సత్యనారయణ కుటుంబ సభ్యులు 10 తులాల వెండిని అందజేశారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు, శ్రీనూకాంబిక సేవాబృందం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.