Feb 05,2023 23:50

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీచేస్తున్న ఎస్‌ఐ శ్యామ్‌సుందర్‌

ప్రజాశక్తి-ఆనందపురం : జై జవాన్‌ ఫౌండేషన్‌, వాకర్స్‌ 20- 20 టీమ్‌ ఆధ్వర్యాన ఆనందపురంలో 100 మంది పేద పిల్లలకు నోటు పుస్తకాలు, ఇతర స్టేషనరీని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆనందపురం ఎస్‌ఐ శ్యామ్‌సుందర్‌ మాట్లాడుతూ, విద్యతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. పిల్లలను విద్యావంతులను చేయాలని తల్లిదండ్రులకు సూచించారు. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన జై జవాన్‌ ఫౌండేషన్‌ టీమ్‌కు, వాకర్‌ 20-20 టీమ్‌ను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ శ్యామ్‌సుందర్‌ను, ఆంధ్రప్రభ సీనియర్‌ జర్నలిస్టు డబ్బీరు విజయకుమార్‌ను జై జవాన్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు కుప్ప రాజశేఖర్‌ సత్కరించి మెమోంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వాకర్స్‌ 20- 20 టీమ్‌ ప్రెసిడెంట్‌ బివిఎస్‌.శేఖర్‌, సెక్రెటరీ ఎం.నాగేశ్వరరావు, ట్రెజరర్‌ జి.రామునాయుడు, వి.మధుసూదనరావు, జై జవాన్‌ ఫౌండేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ముడసల శ్రీను, సెక్రటరీ ముడసల కార్తీక్‌, ట్రెజరర్‌ కుప్ప రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.