
నిత్యావసరాలు అందిస్తున్న ప్రసాదరావు
ప్రజాశక్తి-పెందుర్తి : ఇండో హ్యూమన్ రైట్స్ కేర్ నేషనల్ చైర్మన్ రాజాన ప్రసాదరావు ఆధ్వర్యాన ప్రేమ సమాజంలో కుష్టి వ్యాధి గ్రస్తులకు మందులు, కాటన్ బ్యాండేజ్, హైడ్రోజన్ పెరాక్సైడ్, మాస్క్లు, శానిటైజర్లు, పండ్లు, 25 కిలోల బియ్యం తదితర నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజాన ప్రసాదరావు మాట్లాడుతూ, మానవ హక్కుల పరిరక్షణకు తన వంతుగా పోరాడతానని చెప్పారు. సంస్థ ఆధ్వర్యాన దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.రాజు, ట్రెజరర్ ఆర్.విజయ, జాయింట్ ట్రెజరర్ వరలక్ష్మి, ఉమెన్ వైస్ ప్రెసిడెంట్ పి.హేమలత, జాయింట్ సెక్రెటరీ ఆర్ రిషిత పాల్గొన్నారు.