
రాయచోటి : ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు అన్ని రకాల సేవలు ఒకేచోట అందించాలనే ఉద్దేశంతో పాల కేంద్రాలు మంజూరు చేసింది. వాటికి సంబంధించిన నిర్మాణ పనులు జిల్లాలో నత్తనడకన సాగుతున్నాయి. నిధుల లేమి, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపుల్లో ఆలస్యం కావడంతో, కొన్నిచోట్ల స్థలాల సేకరణ, కోర్టు, పలు కారణాల వల్ల పాల కేంద్రాలు భవన నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయి. జిల్లాలో 219 పాల కేంద్ర భవనాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 6 భవనాలు మాత్రమే పూర్తి చేశారు. 77 భవనాలకు కనీసం పునాదులు కూడా తీయలేదు. పాల కేంద్ర నిర్మాణ పనుల బాధ్యతను పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగానికి అప్పగించారు. 2022వ సంవత్సరంలో ఒక్కో భవన నిర్మాణానికి రూ.15.73 లక్షల చొప్పున జిల్లాలో 219 భవనాలను మంజూరు చేశారు. తరువాత టెండర్లు పిలిచి నిర్మాణ పనుల ప్రారంభించారు. జిల్లాలో 77 చోట్ల భూవి వాదాలు, కోర్టు, కాంట్రాక్టు ముందుకు రాక పోవడం వంటి కారణాలతో పనులు ఇంత వరకు ప్రారంభించలేదు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో 45 గ్రామ పాల కేంద్రాలు మంజూరయ్యాయి. మట్టి తీసినవి 3, పునాదులు 0, గోడలు 2, స్లాబ్ 0, పూతల 0, పూర్తయినవి 2, మదనపల్లి నియోజకవర్గంలో 135 మంజూరు కాగా , మొదలు పెట్టినవి 67,వ ుట్టి తీసినవి 5, పునాదుల 17, గోడల 1, స్లాబ్ 0, పూతలు 1, పీలేరు నియోజకవర్గంలో 20 మంజూరు కాగా ఒక్క భవనానికి మాత్రమే పునాదులు తీశారు. రాయచోటి నియోజ కవర్గంలో 19 మంజూరు కాగా, మొదలు పెట్టినవి 2, పునాదులు 1, గోడలు 1, స్లాబ్లు3, పూర్తయినవి మూడు మాత్రమే ఉన్నాయి. రాజంపేట, రైల్వేకోడూ రు నియోజకవర్గాల్లో ఒక్కటి కూడా మంజూరు కాలేదు,. మిగిలినవి వివిధ దశ లలో నిలిచి పోయాయి. ఇప్పటివరకు 2 శాతం పూర్తయింది. మిగి లిన 98 శాతం పూర్తి కావాలంటే ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందోనని పలు వురు విమర్శిస్తున్నారు. ఇప్పటివరకు చేసిన పనులకు కూడా సకాలంలో బిల్లు అంద డం లేదని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. 2024 సంవత్సరం చివరికి 100 శాతం పూర్తి చేయాలని ప్రభుత్వం పేర్కొంటుంది. సకాలంలో ప్రజలకు పాల సేకరణ కేంద్రాలు భవనాలు పూర్తి స్థాయిలో అవుతాయో లేదో వేచిచూడాల్సిందే.
నిర్మాణ పనులు వేగవంతం చేస్తాం
జిల్లాలో పాల కేంద్రాలను భవన నిర్మాణ పనులను 2024 సంవత్సరానికి పూర్తి చేయడానికి వేగవంతం చేస్తున్నాం. మండల ఇంజినీర్లతో సమీక్షంచి సమావేశాలు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం బిల్లు సకాలంలో అందుతున్నాయి. వంద శాతం పాల కేంద్ర భవన నిర్మాణాలను పూర్తిచేయడానికి అన్ని చర్యలు తీసుకుంటుకున్నాం .
-ఎం.దయాకర్రెడ్డి, పిఆర్ఎస్ఇ,