Jul 31,2021 13:21

నాగార్జునసాగర్‌ : నాగార్జునసాగర్‌ జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువ శ్రీశైలం నుంచి 4 లక్షల 54 వేల క్యూసెక్కుల వరద ఇన్‌ఫ్లోగా వచ్చి సాగర్‌లో చేరుతోంది. నాగార్జునసాగర్‌ నీటిమట్టం 590 అడుగులు కాగా, దాదాపు ప్రస్తుతం 570 అడుగులకు చేరుకుంది. సాగర్‌ నుంచి విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా, ఏ ఎమ్మార్పీ ద్వారా కలిపి 63 వేల క్యూసెక్కుల నీరు ఔట్‌ ఫ్లోగా వెళుతుంది. ప్రస్తుతం సాగర్‌ నీటిమట్టం 254 టిఎంసి లకు చేరుకుంది. సాగర్‌ జలాశయంకు భారీగా వరద రావడంతో క్రస్ట్‌ గేట్లను సిఇ శ్రీకాంతరావు, ఎస్‌ఈ ధర్మ నాయక్‌ లు ఇంజనీరింగ్‌ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జలాశయం ఎస్‌ఇ ధర్మనాయక్‌ మాట్లాడుతూ... నాగార్జున సాగర్‌ జలాశయానికి ఇలాగే వరద కొనసాగితే మరొక రెండు రోజుల్లో క్రస్ట్‌ గేట్లను ఎత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు.