Oct 26,2023 19:48

విద్యార్థిని అభినందిస్తున్న కళాశాల సిఇఒ తిరుమల రెడ్డి

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
అండర్‌-19 నేషనల్‌ ఫుట్‌ బాల్‌ టోర్నీకి ఆంధ్ర జట్టు తరఫున పట్టణంలోని దీక్ష జూనియర్‌ కళాశాల విద్యార్థి ఎంపికయ్యారు. గురువారం జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన ఎస్‌బి.అభిని కళాశాల సిఇఒ తిరుమలరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఎమ్మిగనూరు మండలానికే గర్వకారణమని తెలిపారు. జమ్ముకాశ్మీర్‌ రాష్ట్రంలోని శ్రీనగర్‌లో ఈ నెల 31 నుంచి నవంబర్‌ 4 వరకు 67వ నేషనల్‌ ఫుట్‌ బాల్‌ టోర్నీ జరగనుందని చెప్పారు. ఈ పోటీలకు ఎంపికైన అభికి కళాశాల యాజమాన్యం, సిఇఒ తిరుమలరెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు. కొత్త బూట్లు, జెర్సీ అందజేశారు.