నాణ్యమైన గృహనిర్మాణాలు...
'సిపిఆర్' సొంతం
అందరికీ అందుబాటులో కాస్మోస్ ప్రాజెక్టు
ప్రజాశక్తి-తిరుపతి సిటి
సొంతింటి కోసం కలలు కంటున్న ఆశావాహుల లక్ష్యాన్ని నెరవేర్చేలా నాణ్యమైన గృహనిర్మాణాలు చేపట్టడం సిపిఆర్ కన్స్స్ట్రక్షన్కే సాధ్యమని ఆ సంస్థ డైరెక్టర్ కాశీ విశ్వనాథ్రెడ్డి తెలిపారు. తిరుపతిలో నూతనంగా నిర్మిస్తున్న కాస్మోస్ ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా ఆయన 'ప్రజాశక్తి'తో మాట్లాడారు. ఆయన మాటల్లోనే..
దినదినాభివృద్ది చెందుతూ మహానగరంగా ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి వెలుగొందుతోంది. ఓ పక్క విద్యాకేంద్రంగా, మరోపక్క వ్యాపార కేంద్రంగా విరాజల్లుతుంది. అలాంటి ప్రసిద్దిగాంచిన ప్రదేశంలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దేవేరి అలివేలుమంగమ్మ (పద్మావతిదేవి) కొలువైన తిరుచానూరుకు అతి చేరువలో, తిరుపతి-రేణిగుంట ప్రధాన రహదారిలోని తిరుపతి నగర ప్రదాన ప్రవేశద్వారమైన గోపాల్ ఆటోమొబైల్స్కు వెనుకవైపున వార్డు నెంబరు 3వ డివిజన్, 19వ వార్డులోని పోస్టల్ కాలనీలో సిపిఆర్ కన్స్ట్రక్షన్ నూతన ప్రాజెక్టు కాస్మోస్ అక్టోబరు 1వ తేది ఆదివారం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 3 ఎకరాల 25 సెంట్ల విస్తరణలో 288 యూనిట్లతో 8 అంతస్తులతో (సి+జి) 15వేల స్క్వయర్ పీట్స్ క్లబ్ హౌస్తో న్యూ యూనివర్శి ఆప్ లగ్జరీతో కూడిన హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్టుమెంట్ను వందశాతం వాస్తుతో నిర్మిస్తున్నామన్నారు. ఇందులో డబుల్ బెడ్ రూమ్, త్రిబుల్ బెడ్ రూమ్ ప్లాట్లతో పాటు టెన్సీస్ కోర్టు, క్రికెట్ ఫిచ్, పెద్దల విశ్రాంతి జోన్, పిల్లల కోసం ఆటస్థలం, జాగింగ్ ట్రాక్, పుష్కలంగా ల్యాండ్స్కేపింగ్, మరెన్ని అత్యాధునిక సౌకర్యాలతో సరికొత్త పద్దతిలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో, విశాలవంతమైన ప్రాంతంలో అందర్ని మెప్పించేలా, ఆకర్షణీయమైన గృహాలను నిర్మిస్తున్నామన్నారు. అందరికి అందుబాటు ధరల్లో, మధ్యతరగతి ప్రజలకు మరింత చేరువలో ఉన్న ఈ ప్రాజెక్టును ఆసక్తిగత ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రాజెక్టు ఓపెనింగ్ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ఏర్పాటు చేశామన్నారు. వివరాలకు 9492013322/ 66/88 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని కోరారు.
కాస్మోస్ ప్రాజెక్టు వ్యూ










