ఎంపీఎల్ క్రీడల్లో బహుమతులు అందజేసిన ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణ రాజు

ప్రజాశక్తి-మద్దికేర : మద్దికేర మండల కేంద్రంలో అంబేద్కర్ గ్రౌండ్లో జరిగిన 18వ ఎం పి ఎల్ గవర్నమెంట్ లో గెలుపొందిన వారికి ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణ రాజు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చదువుతోపాటు క్రీడల్లో కూడా తమ నైపుణ్యతను చూపిస్తూ ముందుకు సాగాలని కోరారు. మండల స్థాయి నుండి జాతీయ స్థాయికి ఎదుగుతూ అన్ని రంగాల్లో ముందుండాలని క్రీడ మంచి భవిష్యత్తును చూపిస్తుందని అన్నారు. క్రీడాకారులకు ఎల్లప్పుడూ మా తరఫున మంచి సహాయ సహకారాలు ప్రోత్సాహకాలు, సేవలు అందిస్తామని తెలియజేశారు. ఎం పి ఎల్ క్రికెట్ గవర్నమెంట్ కు సహకరించిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలకు యువతకు పెద్దలకు అభినందనలు తెలిపారు. అనంతరం గెలుపొందిన అజయ్ జట్టుకు మొదటి బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపిఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు పారా రాఘవేంద్ర విఠోబా జి సి రామాంజనేయులు క్రీడాకారులు పాల్గొన్నారు.