Aug 07,2021 15:13

హైదరాబాద్‌ : వైసిపి ఎంపి విజయసాయిరెడ్డికి సిబిఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణలో భాగంగా కౌంటర్‌ దాఖలు చేయాలని విజయసాయి రెడ్డి, సిబిఐని శనివారం న్యాయస్థానం ఆదేశించింది. ఈ నెల 10వ తేదీన బెయిల్‌ రద్దు పిటిషన్‌పై సిబిఐ కోర్టు విచారణ చేపట్టనుంది. విజయసాయి రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని నర్సాపురం వైసిపి రెబల్‌ ఎంపి రఘురామకృష్ణమరాజు పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై శనివారం విచారణ జరిపిన సిబిఐ కోర్టు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలంటూ నోటీసులు జారీ చేసింది.