Aug 12,2021 20:53

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాజమండ్రి ఎంపి మార్గాని భరత్‌కు 'భారత్‌ యూత్‌' పురస్కారం లభించింది. నీతి ఆయోగ్‌ గుర్తింపు పొందిన భారత్‌ గౌరవ్‌ అవార్డు ఫౌండేషన్‌ అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాన్ని ప్రకటించింది. గురువారం నాడిక్కడ ఓ హౌటల్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర గఅహ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్‌ కిశోర్‌ ఈ అవార్డును భరత్‌కు అందజేశారు. ఈ సందర్భంగా భరత్‌ మాట్లాడుతూ ప్రపంచ భవిత యువత చేతిలో ఉందన్నారు.