
- పెద్ద ఎత్తున ఘనంగా స్వాగతం పలికిన వైఎస్ఆర్సిపి నాయకులు
ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : కర్నూల్ నగరంలోని జోరాపురంలో ఉన్న హజరత్ సయ్యద్ అల్లా బకాష్ ఖాద్రి దర్గా ఊరుస్ ఘనంగా జరిగింది. హజరత్ సయ్యద్ అల్లా బకాష్ ఖాద్రి దర్గాలో జరిగిన ప్రత్యేక ఫాతేహ, సలాం దుఆ ప్రార్థనలో ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ స్థానిక వార్డు నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం దర్గా పెద్దలు పీఠాధిపతులు షరీఫ్ పాషా, ఆన్సర్ పాషా, అన్వార్ పాషా, సయ్యద్ నూరే రహత్ పాషా కద్రితో కలిసి సలాం, దుఆ, మరియు ఫాతేహ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఉత్సవ కార్యక్రమంలో వార్డ్ నాయకులు స్థానిక వార్డ్ కార్పొరేటర్ పల్లవి, అక్బర్, చందు గారు, సూర్య మోహన్, నాగేంద్ర, చెన్నమ్మ, లేపాక్షి, చిన్న బాబు, విజయలక్ష్మి, రమేష్, గారిబా, ఫాతిమా, జార్జ్ యూత్, కార్పొరేటర్లు, కో - ఆప్షన్ మెంబర్లు, జిల్లా యూత్ ప్రెసిడెంట్, వార్డ్ నాయకులు, సితార యూత్, ఓల్డ్ సిటీ యూత్, అభిమానులు, ముఖ్యనాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.