Nov 20,2023 17:32

ప్రజాశక్తి - భీమడోలు
  స్వచ్ఛంద సంస్థ మానవత భీమడోలు శాఖ కార్యాలయం నిర్మాణానికి దాతల సహకారంతో అవసరమైన నిధులు సమీకరణ కార్యక్రమం ముమ్మరంగా సాగుతుందని సంస్థ భీమడోలు ప్రాంతీయ కోఆర్డినేటర్‌ పసుపులేటి సాంబశివరావు తెలిపారు. అంబర్‌ పేట గ్రామపంచాయతీ పరిధిలోని వడ్లపట్ల గ్రామంలో నివాసం ఉంటున్న ఒంటరి మహిళ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్టు శాఖ దృష్టికి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన శాఖ సదరు మహిళ నివాసానికి సోమవారం వెళ్లి 25 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులతో పాటు భీమడోలుకు చెందిన సాయిరాం క్లాత్‌ షోరూం సౌజన్యంతో దుస్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి సాంబశివరావుతో పాటు శాఖా సభ్యులు దూసనపూడి పుల్లయ్య, బి.సీతారామయ్య, ఆర్‌ఎం.స్వామి పాల్గొన్నారు.