Feb 27,2023 00:22

డాక్టర్‌ సెంథిల్‌ మురుగన్‌కు జ్ఞాపికను అందిస్తున్న గీతం ప్రతినిధులు

ప్రజాశక్తి -మధురవాడ : గీతం దంత వైద్య కళాశాల ఆసుపత్రి మాక్సిల్లో ఫేషియల్‌ సర్జరీ విభాగం ఆధ్వర్యాన రెండురోజులుగా సూక్ష్మ రక్త నాళాల చికిత్స విధానాలపై దంత వైద్యులకు నిర్వహించిన వర్క్‌ షాప్‌ ఆదివారం ముగిసింది. చెన్నైలోని సవితా దంతవైద్య కళాశాల రీకనస్ట్రక్టివ్‌ సర్జరీ, అంకాలజీ విభాగం అధిపతి డాక్టర్‌ సెంథిల్‌ మురుగన్‌ ఆధ్వర్యాన దంత వైద్యులకు సంబంధిత అంశాలపై అవగాహన కల్పించారు. కింది దవడ దెబ్బతిని రోగికి కాలి ఎముక నుంచి తీసిన భాగాలతో దవడను తిరిగి పునర్మించే అరుదైన చికిత్సను గీతం వైద్యకళాశాల ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి తెరపై వైద్యులకు ప్రత్యక్షంగా గమనించే ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి దంత వైద్యులు హజరైన ఈ వర్క్‌ షాప్‌ ముగింపు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గీతం దంతకళాశాల, ఆసుపత్రి ప్రిన్సిపల్‌ డాక్టర్‌ డి.సీతారామరాజు, ఓరల్‌ సర్జరీ విభాగాధిపతి, ఫ్యాకల్టీ సభ్యుడు డాక్టర్‌ ఎన్‌వివి.సత్యభూషణ్‌ హజరై డాక్టర్‌ సెంథిల్‌ మురుగన్‌ను సన్మానించి జ్జాపికను అందజేశారు.