May 28,2023 00:43

తలకిందులుగా నిరసన చేపడుతున్న మత్స్యకారులు

ప్రజాశక్తి-నక్కపల్లి:హెటిరో డ్రగ్స్‌ కంపెనీ కొత్త పైపు లైన్‌ వేసుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం అప్పలరాజు, మత్య్సకారులు డిమాండ్‌ చేశారు. పైపులైన్‌కు వ్యతిరేకంగా మత్స్యకారులు తలపెట్టిన శాంతియుత మహా ధర్నా శనివారం 542వ రోజుకు చేరింది. మత్య్సకారులు తలక్రిందులుగా నిలబడి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ, ఇప్పటికే వేసిన పైపు లైన్‌తో మత్స్యకారులు ఉపాధి కోల్పోయి వలసలు పోతుంటే, రెండో అతి పెద్ద పైపులైను వేస్తే ఎలా బతుకుతారని ప్రశ్నించారు. మత్య్సకారుల ఉపాధిని దెబ్బ తీసి, వారి జీవితాలను నాశనం చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మామిడి నానాజీ, గోసల స్వామి, చేపలు సోమేష్‌, వాసుపల్లి అప్పారావు, బొంది నూకరాజు, మైలపల్లి దార్రాజు, కొత్వాల్‌ కాశీ, వీర్రాజు, తదితరులు పాల్గొన్నారు.