ఫొటో: మృతుని కుటుంబసభ్యులను పరామర్శిస్తున్న కోట్ల
ప్రజాశక్తి - ఆదోని
సీనియర్ న్యాయవాది, జామియా మసీదు మాజీ ప్రధాన ట్రస్టీ, మజర్ ఉల్ హక్ కుమారుడు అడ్వకేట్ తన్వీర్ అహ్మద్ మృతి పట్ల కేంద్ర మాజీ మంత్రి, టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సోమవారం ఆదోనిలో మృతుని నివాసానికి వెళ్లి సంతాపం తెలిపి, ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా కోట్ల మాట్లాడారు. గతం నుంచి తమ కుటుంబానికి ఆప్తులుగా ఉన్నారన్నారు. చిన్న వయస్సులోనే యువ న్యాయవాది తన్వీర్ అహ్మద్ మృతి చెందడం దురదృష్టకరమన్నారు. టిడిపి నాయకులు భాస్కర రెడ్డి, మాన్వి దేవేంద్రప్ప, రామస్వామి, ఫక్రుద్దీన్, సోమశేఖర్ రెడ్డి, యూనుస్, భద్ర స్వామి, అలసంద గుత్తి అంజి ఉన్నారు. నందవరం మండలం టి.సోమల గూడూరు గ్రామంలో ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ కె.పార్థసారథి రెడ్డిని కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి పరామర్శించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. జిల్లాను సస్యశ్యామలం చేయాలన్నా సంకల్పంతో గుండ్రేవుల, వేదవతి, ఎల్ఎల్సి అండర్ గ్రౌండ్ పైప్ లైన్, ఆర్డిఎస్ కుడి కాలువ నిర్మాణం ప్రాజెక్టులకు చంద్రబాబు హయాంలో జిఒలు తీసుకొస్తే వైసిపి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. టిడిపి నాయకులు ఆరవీటి సుధాకర్ శెట్టి, కదిరికోట ఆదెన్న, వక్ఫ్ బోర్డు జిల్లా మాజీ డైరెక్టర్ జి.అల్తాఫ్, కనకవీడు పెద్ద ఈరన్న, టి.సోమల గూడూరు నాయకులు కమలనాభ రెడ్డి, పుల్లారెడ్డి, రంగారెడ్డి, ఆనంద రెడ్డి, మోహన్ రెడ్డి, బోయ సంజన్న, బోయ సోమన్న, హరిజన కర్రెప్ప, కురువ రాముడు, బోయ నరసింహులు ఉన్నారు.
నందవరంలో పార్థసారథిరెడ్డిని పరామర్శిస్తున్న కోట్ల