Oct 26,2023 19:52

నివాళులర్పిస్తున్న రామాంజినేయులు, నారాయణ

ప్రజాశక్తి - ఆస్పరి
బన్నీ ఉత్సవాల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రామాంజినేయులు, కెవి.నారాయణ డిమాండ్‌ చేశారు. బన్నీ ఉత్సవాల్లో మృతి చెందిన గణేష్‌ మృతదేహానికి గురువారం పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దసరా ఉత్సవాల్లో భాగంగా మాల మల్లేశ్వర స్వామి కల్యాణోత్సవంలో కర్రల సమరంతో బన్నీ ఆడుతుండగా చెట్టు విరిగి అక్కడున్న మాల గణేష్‌తో పాటు మరో ఇద్దరిపై పడిందని తెలిపారు. గణేష్‌ అక్కడిక్కడే మృతి చెందారన్నారు. బన్నీ ఉత్సవాల్లో ప్రాణాలు కోల్పోవడానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని తెలిపారు. దేవరగట్టులో మృతి చెందిన ముగ్గురి కుటుంబాలకు ఎండోమెంట్‌ శాఖ నుంచి ప్రతి కుటుంబానికీ రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందించి, ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం మండల కార్యదర్శి హనుమంతు, నాయకులు బాలకృష్ణ, రంగస్వామి, మాణిక్యప్ప, రంగప్ప, మధు రెడ్డి పాల్గొన్నారు.