ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో : రాష్ట్రంలో ప్రధానంగా పడమర, నైరుతి దిశగా గాలులు వీస్తున్నందున ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు సోమవారం రాత్రి తెలిపారు. రాష్ట్రంలో ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే అధికంగా నమోదైందని, ఇంకా వర్షాలకు అవకాశం ఉందని పేర్కొన్నారు.