
మల్లన్న హుండీ ఆదాయం రూ.3.17 కోట్లు
ప్రజాశక్తి శ్రీశైలం
శ్రీశైల క్షేత్రంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి వాళ్లకు మరియు పరివార దేవుళ్లకు గడిచిన 28 రోజులలో భక్తులు హుండీలలో చెల్లించుకున్న కానుకలను గురువారం నాడు కళ్యాణ మండపంలో లెక్కించడం జరిగింది. ఈ హుండీ లెక్కింపులో నగదురూ 3,17,50,290/- లు హుండీలో లభించాయి. వీటితోపాటు బంగారం 108 గ్రాములు 300 మిల్లీగ్రాములు,వెండి 6 కేజీల 340 గ్రాములు, హుండీలలో లభించాయి. అంతేకాక విదేశీ కరెన్సీలు యూఎస్ఏ డాలర్లు 243, ఆస్ట్రేలియా డాలర్లు 450, కెనడా డాలర్లు 40, యూఏఈ దిరహంస 15, సింగపూర్ డాలర్లు 6, యూరోస్ 5, వంటి విదేశీ కరెన్సీలు హుండీలలో లభించాయి. ఈ హుండీ లెక్కింపు పటిష్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాలో ఈ లెక్కింపు జరిగింది. ఈ హుండీ లెక్కింపు కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు ఆధ్వర్యంలో దేవస్థానం సిబ్బంది శివసేవకులు లెక్కించడం జరిగింది. అని అధికారులు తెలిపారు.