Aug 01,2021 12:40

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. ఆదివారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 17,89, 472 పరీక్షలు చేపట్టగా...41,831 కొత్త కేసులు నమోదయ్యాయి. శనివారంతో పోల్చుకుంటే కాస్త ఎక్కువ. మరో 541 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 3,16,55,824కు చేరుకోగా...మరణించిన వారి సంఖ్య 4,24,351గా ఉంది. గడిచిన 24 గంటల్లో 39,258 మంది కోలుకోగా.. మొత్తంగా 3,08,20,521 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4,10,952 యాక్టివ్‌ కేసులున్నాయి. గత 24 గంటల్లో 60,15,842 మంది వ్యాక్సిన్‌ తీసుకోగా..మొత్తంగా పంపిణీ అయిన వ్యాక్సిన్ల సంఖ్య 47 కోట్ల మార్కును దాటింది. కేరళలో వరుసగా ఐదవ రోజు కూడా 20 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర 6,959, ఎపిలో 2,058, కర్ణాటకలో 1,987 కేసులు వెలుగుచూశాయి.