Nov 03,2023 20:57

మాట్లాడుతున్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

ప్రజాశక్తి - మంత్రాలయం
రాష్ట్రంలో మళ్లీ జగనే ఎందుకు రావాలనే విషయం ప్రజలకు తెలపాలని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి కోరారు. శుక్రవారం మండలంలోని ఎమ్మెల్యే స్వగ్రామమైన రాంపురంలో 'రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలి' అనే అంశంపై మండల స్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో దొంగ ఓట్లు నమోదు కాకుండా చూడాలని సూచించారు. కర్ణాటక అక్రమ ఓట్ల నమోదును అరికట్టాలని కోరారు. రూ.80 వేల నుంచి రూ.కోటి వెచ్చించి ప్రతి గ్రామంలోనూ సచివాలయాల నిర్మాణం చేపట్టామని తెలిపారు. ఇంటింటి ప్రచారం, సచివాలయాల సందర్శన, పార్టీ జెండా ఆవిష్కరణలు 14 రోజుల పాటు ప్రతి గ్రామంలో జరుగుతాయని చెప్పారు. వీటి ద్వారా గ్రామాల్లో 95 శాతం ఓటు బ్యాంకు వచ్చే అవకాశం ఉందన్నారు. టిడిపి నాయకులు పాలకుర్తి తిక్కారెడ్డి ఏం అభివృద్ధి చేశారని 'బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ' పేరుతో అగ్రిమెంట్‌ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి, మంత్రాలయంలో తాను మళ్లీ అధికారంలోకి రావాలంటే అది మీ చేతిలోనే ఉందని పేర్కొన్నారు. ఈనెల 9 నుంచి ఇంటింటి ప్రచారం ప్రతి గ్రామంలో జరగాలని కోరారు. వైసిపి మండల అధ్యక్షులు భీమిరెడ్డి, మండల సలహాదారు విశ్వనాథరెడ్డి, కల్లుదేవకుంట వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షులు రఘునాథ్‌ రెడ్డి, మాజీ జడ్‌పిటిసి లక్ష్మయ్య, శ్రీనివాస్‌ రెడ్డి, మంత్రాలయం సర్పంచి తెల్లబండ్ల భీమయ్య, రోగప్ప, వ్యవసాయ మండల సభ్యులు మల్లికార్జున, ఉప సర్పంచి పరమేష్‌, జనార్ధన్‌ రెడ్డి, ఎంపిపి పులికుక్క రాఘవేంద్ర, ఎంపిటిసి వెంకటేష్‌ శెట్టి, బొంబాయి శివ పాల్గొన్నారు.