తెగుళ్లపై రైతులకు సూచనలు ఇస్తున్న ఎఒ
ప్రజాశక్తి- దేవనకొండ
మండలంలోని అలారుదిన్నె, కుంకనూరు గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బుధవారం మిరప పంటలో వచ్చే తెగుళ్లు, పురుగుల గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఎఒ సురేష్ బాబు మిరప పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. సస్యరక్షణ చర్యల్లో భాగంగా తామర పురుగులు, తెల్ల దోమ ఉధృతి ఎక్కువగా ఉందన్నారు. వీటి నివారణకు ఐపిఎంలో భాగంగా ఎకరాకు 40 పసుపు రంగు అట్టలను, 30 నీలిరంగు అట్టలను, 30 తెలుపు రంగు అట్టలను, పంట పొలాల్లో పెట్టుకోవాలని తెలిపారు. ఎఇఒ జయరాం, హెచ్ఇఒ నాగ సునీల్ కుమార్, విహెచ్ఎ మునిస్వామి పాల్గొన్నారు.