Jan 22,2023 23:07

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సిపిఐ నాయకులు

ప్రజాశక్తి ములగాడ : విశాఖ ఉక్కు ప్రజా గర్జనకు సంబంధించిన పోస్టర్‌ను సింథియా జంక్షన్‌లో సిపిఐ, ఎఐటియుసి ఆధ్వర్యాన ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ, ఈ నెల 30వ తేదీన ఉక్కు ప్రజా గర్జనకు కార్మికులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 23, 24 తేదీలలో రెవెన్యూ డివిజనల్‌ ఆఫీసుల వద్ద దీక్షలు, 25న కలెక్టరేట్‌ ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు లేకపోయినా, సొంత గనులు కేటాయించకపోయినా నిర్విఘ్నంగా స్టీల్‌ప్లాంట్‌ నడుస్తూ లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.50 వేల కోట్లు పన్నులు, ఇతర డివిడెండ్లు రూపంలో చెల్లిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, ఎఐటియుసి నాయకులు కాండ్రేగుల సత్యాంజనేయ, గుడాల రాంబాబు, బోగవెల్లి హరినాథ్‌, డి.గోపాలరావు, టి.కామేశ్వరరావు, వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.