Oct 21,2022 23:51

స్వాధీనం చేసుకున్న డంప్‌తో పోలీసులు

ప్రజాశక్తి- సీలేరు
ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన భారీ డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మల్కన్‌గిరి జిల్లా పోలీసులు తులసీ రిజర్వాయర్‌ అటవీప్రాంతంలో గాలింపు చర్యలు నిర్వహిస్తుండగా, కర్తానపల్లి గ్రామపంచాయతీ పరిధి కట్టాపొదర్‌ వద్ద ఈ డంప్‌ను గుర్తించారు. భారీ మందుపాతరలు, ఆయుధాలు, ల్యాప్‌టాప్‌, మందులను స్వాధీనం చేసుకున్నారు. అమాయకులైన గిరిజనులను, పోలీసులను తుది ముట్టడించడానికి మావోయిస్టులు ఈ డంప్‌లో పేలుడు సామాగ్రిని ఉంచినట్లు పోలీసులు పేర్కొన్నారు.