
ప్రజాశక్తి-చింతపల్లి: తమ సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలని మాతృభాష వాలంటీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాంగి శ్రీను డిమాండ్ చేశారు. మాభాష వాలంటీర్లు శుక్రవారం చింతపల్లిలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం ప్రత్యేక స్పందన కార్యక్రమంలో అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పాడేరు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి వి అభిషేక్, అదేవిధంగా వైకాపా ఉమ్మడి విశాఖ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ వై వి సుబ్బారెడ్డి, డీఈవో, ఎంఈఓ లకు వినతి పత్రాలు సమర్పించారు. మాతృభాష విద్యా వాలంటీర్లకు సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. స్థానిక బాష కలిగిన చోట నూతనంగా ఆ మాతృభాష విద్యా వాలంటీర్లను నియమించాలని, పాఠశాలలు తెరిచిన నాటి నుంచే తమను విధులలోకి తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాతృభాష విద్యా వాలంటీర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.సత్తిబాబు, మండల అధ్యక్షుడు ఎం బాబ్జి, ఉపాధ్యక్షుడు కే చిరంజీవి, కార్యదర్శి డి రాజబాబు, కోశాధికారి జి. మహేష్, సంతోష్, జి. బాస్, లింగు బాబు, లక్ష్మి, ఝాన్సీ, రమ, వీర్రాజు, కే. బాలరాజు, శంకర్రావు పాల్గొన్నారు.