
మారథాన్, సైక్లింగ్ ద్వారా చిరుధాన్యాలపై అవగాహన ర్యాలీ
ప్రజాశక్తి - క్యాంపస్ : అంతర్జాతీయ మిల్లెట్స్ ఇయర్ 2023 పురస్కరించుకుని మంగళవారం జాతీయ సంస్కత విశ్వవిద్యాలయంలో ఉదయం ఆరున్నర గంటలకు విశ్వవిద్యాలయం ప్రముఖ భరతమాత విగ్రహం నుండి మారథాన్, సైక్లింగ్ అనే కార్యక్రమం మిల్లెట్స్ పై అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి నగర కమిషనర్ డి. హరిత, విశిష్ట అతిథిగా రీజనల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ డా కె.వి శ్రీనివాసరావు, సన్మాన అతిథిగా తుడా సెక్రటరీ ఎస్ లక్ష్మి, విశేష అతిథిగా ఆంధ్రప్రదేశ్ పూర్వపు ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎన్ ముక్తేశ్వరరావు హాజరయ్యారు. ప్రముఖ ఆయుర్వేదిక్ ఫిజీషియన్, లిబ్రరీ క్రిటిక్ డా.జి పూర్ణచంద్, మిల్లెట్స్ పైన విశేష కషిచేస్తున్న పద్మశ్రీ, చిరుధాన్యాల పరిశోధకులు డా.ఖాదర్ వలీ, రైతు నేస్తం ఫౌం డేషన్ ఫౌండర్, పద్మశ్రీ డాక్టరు వై వెంకటేశ్వర రావు కార్యక్రమానికి విచ్చేశారు. డి హరిత మాట్లాడుతూ మిల్లెట్స్ మన జీవితంలో భాగంగా చేసుకుని మనమందరం ఆరోగ్యంగా ముందుకు సాగాలని, మన శరీరంలో రోగాల ను మిల్లెట్స్ సహాయంతో ఏ విధంగా నివారించవచ్చు? ఎటువంటి శక్తిని మనం పొందవచ్చు అనే అంశాన్ని వివరించారు. విశిష్ట అతిథి రీజనల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. డా. శ్రీనివాసరావు మాట్లాడుతూ మిల్లెట్స్ ఇయర్ సందర్భంగా ఈ మారథాన్, సైక్లింగ్ నిర్వహించడం చాలా గర్వకారణమైన విషయమని తెలిపారు. చివరగా అందర్నీ అభినందిస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ విశ్వవిద్యా లయం వైస్ ఛాన్సలర్ జి.ఎస్.ఆర్ కష్ణమూర్తి, ముఖ్య తిథులు విచ్చేసిన డి.హరిత, ఇతర అతిథులతో కలిసి జెండా ఊపి ఈ మారథాన్, సైక్లింగ్ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ విశ్వవిద్యాలయంలోని భరతమాత విగ్రహం నుండి ప్రారంభమయ్యి, రామకష్ణడీలెక్స్, జ్యోతిటాకీస్, మహతి రోడ్, ఎన్.టి.ఆర్ సర్కిల్ మీదుగా బాలజీ కాలనీ కూడలి మార్గం గుండా సౌత్ గేట్ ద్వారా విశ్వవిద్యాలయం భారతమాత విగ్రహం వద్ద ముగిసింది. ఈ కార్యక్రమానికి డా.పి.మాధవరావు కో-ఆర్డినేటర్ గా, డా.ఆర్.లక్ష్మీ నారాయణ, డా. కుమార భాగేవాడిమట్ అడిషనల్ కో-ఆర్డినేటర్లు గా వ్యవహరించారు. ప్రత్యేకించి ఎన్.ఎస్.ఎస్. కో-ఆర్డినేటర్ డా.ఎ.చందూలాల్, ఎన్ఎస్ఎస్. ప్రోగ్రాం ఆఫీసర్స్ ఈ ర్యాలీ విజయవంతానికి తోడ్పడ్డారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం అధ్యాపకులు అధికారులు, రీసెర్చ్ స్కాలర్స్, ఎస్ఎస్ఎస్ వాలంటీర్లు, ఇతరులు 500 పైగా పాల్గొని విజయవంతం చేశారు.