
ప్రజాశక్తి-కొయ్యూరు
చింతపల్లి మాజీ శాసనసభ్యులు, సిపిఐ నేత గొడ్డేటి దేముడు 8వ వర్థంతి సందర్భంగా మండలంలోని వెలగలపాలెంలో గురువారం ఆయన కాంస్య విగ్రహానికి, చిత్ర పటానికి పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, అరకు ఎంపీ, దేముడు కుమార్తె గొడ్డేటి మాధవి, పలువురు నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గిరిజన జాతికి గొడ్డేటి దేముడు విశేష సేవలు అందించారని, ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బడుగు రమేష్, జెడ్పీటీసీ వారానూకరాజు, వైస్ ఎంపీపీలు అంబటి నూకాలమ్మ, అప్పన్న వెంకటరమణ, వైసిపి నాయకులు జల్లి బాబులు, గాడి నాగమణి, బండి సుధాకర్, సూరిబాబు, సర్పంచులు నాయుడు, జంపా రాజకుమారి, దొడ్ల రమేష్, రాజు, చందు, నూకాలమ్మ, చిన్నారావు, ఎంపీటీసీలు సిహెచ్.మల్లేశ్వరి, నూకరత్నం, నాయకులు నీలాపు సూరిబాబు, రీమాలి గంగాధర్, సిహెచ్ సావిత్రి, గాడి సత్యనారాయణ, గజ్జయ్య దొర, అచ్యుత్, శేఖర్, రామరాజు, గాడి అచ్చిరాజు, అల్లాడ నగేష్ పాల్గొన్నారు.
2000 గడియారాలు పంపిణీ
మాజీ ఎమ్మెల్యే జి.దేముడు 8 వర్ధంతి కార్యక్రమాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో అభిమానులు రాగా, సుమారు 2000 మందికి గడియారాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని దేముడు కుమార్తె, అరకు ఎంపీ మాధవి, ఆమె భర్త, నేను సైతం ఫౌండేషన్ అధినేత శివప్రసాద్ పర్యవేక్షించారు.