
ప్రజాశక్తి తగరపువలస : మాదక ద్రవ్యాల వినియోగం వల్ల అనేక అనర్థాలు కలుగుతాయని ఎస్ఇబి జాయింట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక అనిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రానున్న 3 నెలల కాలంలో మాదక ద్రవ్యాలు లేని రాష్ట్రంగా తయారుకావలన్న ధృడ సంకల్పంతో పటిష్ట చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మత్తు పదార్థాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. మాదక ద్రవ్యాలు వాడితే ఏ తరహా శిక్షలకు గురవుతారో వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఇబి సూపరింటెండెంట్ బి.శ్రీనాధుడు, ఇన్స్పెక్టర్ వి.రామకృష్ణ, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామకృష్ణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.