Sep 03,2023 23:58

ప్రజాశక్తి - చీరాల
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తాడేపల్లిగూడెంలో జరుగుతున్న యువగళం పాదయాత్రలో చీరాల టిడిపి సీనియర్ నాయకులు సజ్జా వెంకటేశ్వరరావు లోకేష్‌ను అనుసరించారు. ఆయనతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి నియోజకవర్గంలో కృషి చేయాలన లోకేష్‌ సూచించారు. పార్టీ అమలు చేయబోయే సంక్షేమ పథకాలు, టిడిపి మేనిఫెస్టోను ప్రజలకు వివరించాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో చీరాలలో టిడిపి జెండా ఎగురవేయాలని కోరారు.