Aug 02,2021 08:29

కర్నూలు : శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. భారీగా వరద నీరు చేరుతుండటంతో అధికారులు ప్రాజెక్ట్‌ 10 గేట్లను 15 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్‌ ఇన్‌ ప్లో: 4,41,914 క్యూసెక్కులు కాగా, ఔట్‌ ఫ్లో: 4,35,525 క్యూసెక్కులుగా నమోదయింది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా, ప్రస్తుతం 883.80 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటినిల్వ 215.8070 టిఎంసి లు కాగా, ప్రస్తుతం 208.7210 టిఎంసి లుగా ఉంది. ప్రాజెక్ట్‌ కుడి, ఎడమ గట్టు జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతుంది.