న్యూఢిల్లీ : టోక్యో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ సాధించిన మీరాబాయి చాను భారత్కు తిరిగొచ్చింది. ఆమె వచ్చీరాగానే ఏం చేసిందో తెలుసా? తనకెంతో ఇష్టమైన పిజ్జాను తిన్నది. అది కూడా ఎవరి పక్కన నిల్చుని తిన్నది అంటే.. కేంద్ర న్యాయశాఖ మంత్రి జస్టిస్ కిరణ్ రిజిజుతో కలిసి పిజ్జా పంచుకుంది. ఆమె స్వదేశానికి రాగానే మణిపూర్లో తనని సత్కరించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె రిజిజుతో పిజ్జాను షేర్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోను రిజిజూ తన ట్విటర్ ద్వారా షేర్ చేయడమే కాకుండా.. 'ఎట్టకేలకు మీరాబాయి పిజ్జా తిన్నది' అని ఫొటోకి వ్యాఖ్యను జోడించారు. అలాగే చాంపియన్షిప్ కోసం తన వెయిట్ను కంట్రోల్లో ఉంచుకోవాలనే కారణంతోనే ఆమె పిజ్జా తినలేదు. ఇప్పుడు తను పిజ్జాను తినొచ్చు. అది కూడా తన తదుపరి ఛాంపియన్షిప్ కోసం శిక్షణ ప్రారంభించేవరకు పిజ్జాను పూర్తిగా ఆస్వాదించవచ్చు' అని ట్వీట్ చేశారు. అలాగే ఆమెకు ప్రశంసా చిహ్నంగా.. పిజ్జా దిగ్గజం డొమినో జీవితకాలం తనకు ఉచితంగా పిజ్జాలను ఇవ్వనున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే.