Mar 01,2023 00:24

ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న జాయింట్‌ కలెక్టర్‌ విశ్వనాథన్‌

ప్రజాశక్తి-పద్మనాభం : క్వారీ ఏర్పాటుపై మండలంలోని రెడ్డిపల్లి గ్రామ సచివాలయ ప్రాంగణంలో అధికారులు మంగళవారం గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాలుష్య నియంత్రణ ఇఇ శ్రీనివాసరావు, జాయింట్‌ కలెక్టర్‌ విశ్వనాథన్‌, ఆర్‌డిఒ భాస్కర్‌రెడ్డి హాజరై ప్రజాప్రాయసేకరణ చేశారు. సభకు హాజరైన వారు సమ్మతించడంతో అధికారులు సభను ముగించారు. మొక్కుబడిగా ప్రజాభిప్రాయ సేకరణ క్వారీ ఏర్పాటుపై గ్రామ సభ నిర్వహిస్తున్నట్లు స్థానికులకు ఎటువంటి సమాచారమూ ఇవ్వలేదని జెడ్‌పిటిసి మాజీ సభ్యులు కసిరెడ్డి దామోదరరావు, శేరీఖాండం సర్పంచ్‌ పల్లాంటి చిన్నారావు ఆరోపించారు. క్వారీకి అనుమతి ఇచ్చిన ప్రదేశం రెడ్డిపల్లి రెవెన్యూ అయినప్పటికీ ఆ ప్రదేశంలో శేరీఖాండం గ్రామానికి చెందిన 50 శాతం రైతులకు చెందిన భూమి ఉందని వారు తెలిపారు. భూమి ఉన్న రైతులకు ఎటువంటి సమాచారమూ ఇవ్వకుండా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన భూమి కూడా లేని వారిని పిలిచి సమావేశం ముగించారని మాజీ సర్పంచ్‌ కుమార్‌, నమ్మి వెంకటరావు, వాడపల్లి శ్రీనివాసరావు, టి.అప్పలరాజు, వి.వెంకటరావు ఆరోపించారు. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాలు ఏర్పాటుచేసినప్పుడు క్వారీకి సమీపంలో ఉన్న రైతులకు సమాచారం ఇవ్వాలని డిమాండ్‌చేశారు. గ్రామసభలో డిప్యూటీ తహశీల్దార్‌ కిశోర్‌, సచివాలయ కార్యదర్సి రవి, ఉప సర్పంచ్‌ శిరుగుడి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.