Aug 27,2022 19:54

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి కుప్పం జోలికొస్తే చంద్రబాబు నాయుడు చేతిలో కుప్పకూలి పోవడం ఖాయమని టిడిపి నాయకులు హెచ్చరించారు. శనివారం కోట్ల క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు ఆరవీటి సుధాకర్‌ శెట్టి, కదిరికోట ఆదెన్న, వక్ఫ్‌ బోర్డు జిల్లా మాజీ డైరెక్టర్‌ జి.అల్తాఫ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సగర (ఉప్పర) ఫెడరేషన్‌ మాజీ డైరెక్టర్‌ ఉప్పర ఆంజనేయులు, మున్సిపల్‌ మాజీ కౌన్సిలర్‌ హరి ప్రసాద్‌ రెడ్డి మాట్లాడారు. టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసిపి అరాచకాలు విధ్వంసాలు సృష్టించడం అప్రజాస్వామికమని తెలిపారు. టిడిపి సొంతంగా నిర్వహిస్తున్న 'అన్నా క్యాంటీన్‌'ను కూడా ధ్వంసం చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్న జగన్‌ సర్కారుపై ప్రతిఘటించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. టిడిపి నాయకులు, ఆత్మ మాజీ ఛైర్మన్‌ కందనాతి శ్రీనివాసులు, నందవరం మండల నాయకులు ముగతి వీరారెడ్డి, పట్టణ ముస్లిం, మైనార్టీ నాయకులు కెఎమ్‌డి.జబ్బార్‌, గోరా బాషా, మహబూబ్‌ బాషా, ఆఫ్గాన్‌ వలీ బాషా, టిడిపి పట్టణ ఎస్సీ సెల్‌ నాయకులు రోజా ఆర్ట్స్‌ హుస్సేని, దర్జీ మోషన్న, కోట్ల క్యాంపు కార్యాలయ ఇన్‌ఛార్జీ కె.శంకరన్న పాల్గొన్నారు.