Aug 27,2022 19:58

గుమ్మనూరులో బాలుని గాయపరిచిన కుక్కలు

ప్రజాశక్తి - చిప్పగిరి
మండలంలోని గుమ్మనూరు గ్రామంలో కుక్కల దాడిలో బాలునికి గాయాలయ్యాయి. గ్రామస్తుల వివరాల మేరకు... శనివారం గుమ్మనూరులోని కోటవీధిలో ఉన్న కుక్కలు ఎవరూ లేని సమయంలో బాలునిపై దాడి చేశాయి. బాలుని కిందపడేయగా అరుపులకు ప్రజలు చూసి వెంటనే బాలుని రక్షించారు. కొద్దిగా ఆలస్యమయినా బాలుని ప్రాణానికే ముప్పు ఏర్పడేది. కొద్ది రోజుల క్రితం అవే కుక్కల దాడిలో వృద్ధుడు మరణించినట్లు గ్రామస్తులు తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి ఆ కుక్కలను తరలించాలని గ్రామస్తులు కోరారు.