Jan 08,2023 23:34

విజేతలకు ట్రోఫీ అందజేస్తున్న ఏడువాక సన్యాసిరావు

ప్రజాశక్తి - ఆరిలోవ : శ్రీలీలా సుందరయ్యనగర్‌ గణేష్‌ యూత్‌ ఆధ్వర్యాన ఆదివారం పోలీస్‌బ్యారెక్స్‌లో జరిగిన క్రికెట్‌ టోర్నమెంట్‌ విజేతలకు ట్రోఫీ అందజేశారు. తెలుగుదేశం పార్లమెంట్‌ కమిటీ కార్యదర్శి, శ్రీలీలాసుందరయ్యనగర్‌ గ్రామ అధ్యక్షులు ఏడువాక సన్యాసిరావు ముఖ్యఅతిథిగా పాల్గొని విజేతలకు ట్రోఫీ, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిద్దార్థ కాలేజీ ప్రిన్సిపల్‌ లోలుగు మోహన్‌, సంఘం సభ్యులు పాల్గొన్నారు.