ప్రజాశక్తి-ఆదోని
పట్టణంలోని పింజరివాడిలో ఐపిఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేసి మూడో పట్టణ పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. శనివారం నగదు, సెల్ ఫోన్లు, బైకులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ శివ నారాయణ స్వామి మాట్లాడారు. ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు సిఐ శ్రీరామ్ సిబ్బందితో దాడులు నిర్వహంచారని తెలిపారు. బెట్టింగ్ నిర్వాహకులు బోయ మహానంది, పింజరి హుస్సేని, పింజరి మహ్మద్ ఖాసీం, వడ్ల రాఘవేంద్ర నుంచి సుమారు రూ.80 లక్షల నగదు, సెల్ ఫోన్లు, రెండు మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పరారీలో ఉన్న బోయ రమేష్, ఇస్మాయల్, గొల్ల భీమ, ప్రతాప్, శ్రీనివాసులు, గౌడవలీ నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దాడుల్లో సిఐ శ్రీరామ్, ఎస్ఐలు ఆర్.జయ శేఖర్, బి.చిన్న పీరయ్య, పోలీసు సిబ్బంది నరేంద్ర, సోమేష్, ఖాసీం వలీ, నరసింహా, మంజు కుమార్, మురళీని ప్రత్యేకంగా అభినందించారు. అసాంఘిక కార్యకలాపాల పట్ల ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు. అలాంటి వారి సమాచారం తమకు ఇస్తే కట్టడికి సహకరించిన వారవుతారని తెలిపారు.
నగదు, నిందితులను చూపుతున్న డీఎస్పీ