ప్రజాశక్తి - కోసిగి
కోసిగిలోని 1వ వార్డు ప్రజలు శుక్రవారం తెలంగాణ రాష్ట్రం బెల్లంపల్లికి పిల్లాపాపలతో పత్తి పనులకు వలస వెళ్లారు. ఖరీఫ్ సీజన్లఓ వర్షాలు సరిగా కురవకపోవడంతో వేసిన పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. పంటలను పొలాల్లోనే వదిలేసి బతుకుదెరువు కోసం సుదూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పత్తి పనులు మొదలయ్యాయని, అక్కడ కిలో రూ.10 ఇస్తారని, ఎంత చేసుకుంటే అంత కూలి వస్తుందని కూలీలు తెలిపారు. ప్రతేడాది వర్షాభావ పరిస్థితుల వల్ల వేసిన పంటలన్నీ పూర్తిగా నష్టపోయాయని వాపోయారు. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతమైన కోసిగిలో చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేస్తే వలసలు నివారించి, ఇక్కడున్న ప్రజలకు ఉపాధి కల్పించాలని మండలంలోని ప్రజలు కోరుతున్నారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని తెలిపారు.
రైతులకు నష్టపరిహారం అందించాలి
- రైతు సంఘం మండల అధ్యక్షులు కె.వీరేష్
తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వ నష్టపరిహారం అందించి ఆదుకోవాలి. వలసలను నివారించేందుకు అధికారులు ప్రత్యేక చొరవ చూపించి పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలి.
కోసిగి నుంచి తెలంగాణ రాష్ట్రానికి వలస వెళ్తున్న కూలీలు