ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో : రాష్ట్రంలో పడమర గాలులు వీస్తున్నాయని, రాగల 48 గంటల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు ఆదివారం వెల్లడించారు. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కొద్దిచోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.