
ప్రజాశక్తి - ఆరిలోవ : జివిఎంసి12వ వార్డు పరిధి కొండవాలు ప్రాంతంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం గురువారం నిర్వహించారు. వార్డు టిడిపి ఇన్ఛార్జి ఒమ్మి అప్పలరాజు ఆధ్వర్యాన నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పాల్గొని సింహగిరి కాలనీ నుంచి దీనదయాల్పురం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి స్థానిక సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. దేవస్థానం భూముల్లో నివాసముండే వారికి కనీస మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వ వైఖరి, నిత్యావసర ధరలు పెంపు, విద్యుత్ ఛార్జీలు, ఇంటి పన్ను, చెత్త పన్ను, రవాణా ఛార్జీలు పెంపు వంటి సమస్యలపై స్థానికులు ఎమ్మెల్యే ముందు ఏకరువు పెట్టారు. ఈ కార్యక్రమంలో 9, 10, 11, 12, 13 వార్డుల తెలుగుదేశం పార్టీ నాయకులు బుడుమూరు గోవిందు, గాడి సత్యం, ఒమ్మి పోలారావు, బాలస్వామి, భరత్ తదితరులు పాల్గొన్నారు.