Nov 14,2023 22:46

విరాళం అందజేస్తున్న దాతలు

మడకశిర : నియోజకవర్గ పరిధిలోని రొళ్ల మండలం కాలువేపల్లి గ్రామంలో లక్ష్మీ రంగనాథ స్వామి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కళ్యాణ మండపం అభివృద్ధికి దాతలు విరాళం అందజేశారు. కర్నాటక రాష్ట్రం సిరా తాలూకా తరూరు గ్రామానికి చెందిన సాదా సామాజికవర్గం వారు తమ వంతుగా రూ. 1.03 లక్షలను విరాళంగా అందించినట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు రాజన్న, శ్రీ రంగప్ప, తిమ్మప్ప, రమేష్‌ తెలిపారు.కళ్యాణ మండపం నిర్మాణానికి కర్నాటక ప్రాంత వాసులు కాలెప్ప, శివ శంకర్‌ రావు, రంగమ్మ, నాగరత్నమ్మ, జయరామప్ప, నాగరాజు, గోపాలకృష్ణ, రంగప్ప, వనజాక్షి తమవంతుగా విరాళం అందించడం పట్ల వారికి కృతజ్ఞతలు చెప్పారు.