ఢిల్లీ : విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనకు తెదేపా ఎంపీలు మద్దతు పలికారు. జంతర్మంతర్ వెళ్లి ఆందోళన చేస్తున్న ఉక్కు కార్మికులకు ఎంపీ గల్లా జయదేవ్, కనకమేడల మద్దతు తెలిపారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు పార్టీలన్నీ కలిసి పోరాడాలన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ఉద్యమకారులకు మా పార్టీ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా పార్లమెంటు లోపల, బయట పోరాటం చేస్తామన్నారు.