
నీరు విడుదల అవుతున్న దృశ్యం
కెసి కెనాల్కు నీటి విడుదల
ప్రజాశక్తి - నందికొట్కూరు టౌన్
మల్యాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా శనివారం నాడు కే.సి.కెనాల్కు నీటిని విడుదల చేశారు. నంద్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం నాడు జరిగిన జిల్లా నీటిపారుదల శాఖ ముఖ్య అధికారుల సమావేశానికి ఎమ్మెల్యే ఆర్థర్ హాజరై నందికొట్కూరు నియోజకవర్గంలోని రైతులకు నీటి విడుదల అవసరం గురించి చర్చించి నీరు విడుదల చేయించరాని, నీటిపారుదల శాఖ అధికారులకు, ఎమ్మెల్యేకు రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు.