Nov 17,2023 22:57

ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌:
కార్మికులు, కర్షకుల నడ్డివిరుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించేందుకు ప్రతి ఒక్కరూ నడుబిగించాలని ఏఐటియూసి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్‌.నాగసుబ్బారెడ్డి అన్నారు. శుక్రవారం చిత్తూరు ఏఐటియూసి అనుబంధ సంగాల నగర కౌన్సిల్‌ సమావేశం దాసరి చంద్ర అధ్యక్షతన జరిగింది. సమావేశ ప్రాధాన్యత అజెండాను నగర కార్యదర్శి ఏ.సత్యమూర్తి వివరించారు. ఈ సందర్భంగా నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించాల్సిందే అని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను ఎండ కట్టారు. రైతులు కార్మికులు ఇబ్బందులకు గురి అవుతున్న పట్టించుకోకపోవడం దుర్మార్గం , దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వరంగ సంస్థలను ఆదాని, అంబానీలకు కట్టబెట్టి దేశాన్ని, దేశ ప్రజలను దగా చేస్తున్నారని ధ్వజమెత్తారు. మోడీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అడిగే ధైర్యం జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వానికి లేదన్నారు. దేశవ్యాప్తంగా కార్మిక వర్గం, రైతాంగం సమన్వయంగా ఐక్య పోరాటాలు చేస్తూ బిజెపి ప్రభుత్వాన్ని జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించేంతవరకు పోరాటం కొనసాగించాలని కార్మిక వర్గానికి రైతందానికి ప్రజా సంఘాలకు పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏర్పడిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయడానికి బిజెపి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే సపోర్ట్‌ చేస్తూ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కార్మిక వర్గం ఎండగట్టాలన్నారు. నవంబర్‌ 27, 28 విజయవాడలో జరిగే కార్మిక రైతు మహాధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో ఏఐ టీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్‌.నాగరాజు, ఏఐటియుసి జి ల్లా కార్యదర్శి టి.కోదండ నాయకులు గోపీనాథ్‌, మణి, రమాదేవి, అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, గంజి రామ మూర్తి, సుబ్రహ్మణ్యం, ప్రభావతి, వెంకటేష్‌, రజిని కుమార్‌ , అరు ణ, జయ చంద్ర, నాగరాజ్‌ , జయశంకర్‌ , సురేష్‌ , వినాయక , దొరస్వామి, కష్ణ, శ్రీనివాసులు, మురుగేషన్‌ , కమల్‌ , జయలక్ష్మి, రమ,మణి మేగల, మోహన్‌ , బాలాజీ రావు తదితరులు పాల్గొన్నారు.